హైదరాబాద్లో భూకబ్జాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, చెరువుల ఆక్రమణలను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హైడ్రాను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి అమలులోకి తీసుకురావడానికి నిర్ణయించారు. దీనిని నేడు సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా ప్రారంభించనున్నారు. హైదరాబాద్ నగరంలోని బుద్ధభవన్ పక్కనే నిర్మించిన ఈ హైడ్రా పోలీస్ స్టేషన్ను జీ ప్లస్ 2 అంతస్తులతో ఏర్పాటు చేశారు. హైడ్రా పోలీస్ స్టేషన్కు ఏసీపీ తిరుమల్ ఎస్హెచ్వోగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందులో ఆరుగురు ఇన్స్పెక్టర్లు, 12 మంది సబ్ఇన్స్పెక్టర్లు, 30 మంది కానిస్టేబుళ్లు విధులు నిర్వహించనున్నారు.