తిరుమలలో జూలై నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ నేడు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేసింది. ఈ-సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం 21న ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. ఊంజల్ సేవా కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లకు సంబంధించిన జూలై కోటాను ఈనెల 22న విడుదల చేస్తారు.