Saturday, April 26, 2025

మహిళలపై టీడీపీ కార్యకర్తల దాడి

Must Read

వైసీపీ హయాంలో ఇల్లు నిర్మించుకున్న మహిళలపై టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. వృద్ధురాళ్లు అనే దయ లేకుండా విచక్షణ రహితంగా దాడి చేశారు. ఇప్పుడున్నది తమ ప్రభుత్వమంటూ దారుణానికి పాల్పడ్డారు. ఇనుప రాడ్లతో కొట్టారు. ఈ ఘటన అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం భోగినేపల్లిలో జరిగింది. ఆదివారం రాత్రి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు కరె వెంకటేశ్, కరె ప్రసాద్ అనే అన్నదమ్ముళ్లు.. స్థానికంగా ఇల్లు నిర్మించుకున్న నాగమ్మపై దాడి చేశారు. ఆ ఇంటి స్థలం తమదంటూ దాష్టీకానికి పాల్పడ్డారు. గ్రామస్తులు అడ్డుకోవడంతో గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -
- Advertisement -
Latest News

మ‌తం గురించి మాట్లాడొద్దు – ఏకనాథ్ షిండే

పహల్గామ్ ఉగ్రదాడి నేప‌థ్యంలో ఓ మ‌తానికి చెందిన వారిపై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై బీజేపీ మిత్రపక్షం శివసేన పార్టీ అధ్యక్షుడు, మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే...
- Advertisement -

More Articles Like This

- Advertisement -