నారాయణ కాలేజీలో ఓ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డికి చెందిన విద్యార్థిని అనూష, హైదరాబాద్ శివారు బాచుపల్లి నారాయణ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతోంది. దసరా సెలవుల తర్వాత తల్లిదండ్రులు ఆదివారం ఆమెను కాలేజీలో వదిలేసి వెళ్లారు. అనూష స్పృహ కోల్పోయిందని సోమవారం పేరెంట్స్ కు ఫోన్ వచ్చింది. తల్లిదండ్రులు అక్కడికి వెళ్లే సరికి అనూష ఉరి వేసుకొని మృతి చెందిందని తెలిపారు. డెడ్ బాడీని ఆసుపత్రికి తరలించామని చెప్పారు. దీంతో తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యంతో ఆందోళనకు దిగారు.