Saturday, May 17, 2025

పోలీసులపై మరోసారి పవన్ కళ్యాణ్ ఫైర్!

Must Read

వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలీసుల వైఖరిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. మంగళవారం వేమవరంలోని సరస్వతి ప్లాంట్ భూములను పరిశీలించేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం ఇక్కడి యువతని భయపెడితే.. పోలీసులు చూస్తూ ఊరుకున్నారని తెలిపారు. పోలీసులు మెత్తబడ్డారా? లేక భయపడ్డారా? అని ప్రశ్నించారు. ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ అంటే అనుమతి రాదని అందుకే పవర్ ప్లాంట్ అని చెప్పారన్నారు. పేదలకు ఇచ్చిన భూములను అన్యాయంగా లాక్కున్నారని ఫైర్ అయ్యారు. భయపెట్టి, బాంబులు వేసి రైతుల భూములు లాక్కున్నారని మండిపడ్డారు. తాము మెతక వైఖరితో లేమని చెప్పేందుకే ఇక్కడికి వచ్చామన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

స‌రిహ‌ద్దుల్లో మ‌రో తెలుగు జ‌వాన్ వీర మ‌ర‌ణం

భారత్-పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ క్ర‌మంలో నిన్న తెలుగు జ‌వాన్ ముర‌ళీ నాయ‌క్ అమ‌రుడైన సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌రో తెలుగు...
- Advertisement -

More Articles Like This

- Advertisement -