ఏపీలోని బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జిల్లాలోని అనుమతులు లేకుండా ఆక్వా చెరువులు నడుపుతున్న యజమానులు.. ప్రతి నెలా మామూళ్లు చెల్లించాలని బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు. అధికారుల సమక్షంలోనే ఈ హెచ్చరిక చేయడంతో అందరూ కంగుతున్నారు. దీనిపై ప్రతిపక్ష వైసీపీ నేతలు కౌంటర్లు వేస్తున్నారు. మైనింగ్, లిక్కర్ మాఫియాకు తోడు ఇప్పుడు ఆక్వా ఆదాయంపై చంద్రబాబు కన్నేశారని విమర్శిస్తున్నారు.