Tuesday, May 12, 2026

ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల‌ సీఎం‌ల భేటీ

Must Read

ఢిల్లీలోని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రాల మధ్య నీటి వనరుల పంపకం, నిర్వాహక విభజన, ప్రస్తుత ప్రాజెక్టుల పురోగతిపై ఈ సమావేశంలో లోతైన చర్చ జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర జలశక్తి శాఖ అధికారులు, రెండు రాష్ట్రాల ఇరిగేషన్ ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ మధ్యవర్తిగా వ్యవహరించిన ఈ భేటీ శాంతియుతంగా కొనసాగింది. పలు వివాదాస్పద ప్రాజెక్టుల విషయాలను, వాటి నిర్వహణ బాధ్యతలపై క్లారిటీ కోసం ఈ చర్చలు చేపట్టినట్లు సమాచారం. రెండు రాష్ట్రాల మధ్య మంచి సమన్వయం ద్వారా నీటి వనరుల సమర్థవంతమైన వినియోగానికి దారి తీయాలని కేంద్రం ఆశిస్తోంది.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -