Sunday, December 7, 2025

ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల‌ సీఎం‌ల భేటీ

Must Read

ఢిల్లీలోని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రాల మధ్య నీటి వనరుల పంపకం, నిర్వాహక విభజన, ప్రస్తుత ప్రాజెక్టుల పురోగతిపై ఈ సమావేశంలో లోతైన చర్చ జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర జలశక్తి శాఖ అధికారులు, రెండు రాష్ట్రాల ఇరిగేషన్ ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ మధ్యవర్తిగా వ్యవహరించిన ఈ భేటీ శాంతియుతంగా కొనసాగింది. పలు వివాదాస్పద ప్రాజెక్టుల విషయాలను, వాటి నిర్వహణ బాధ్యతలపై క్లారిటీ కోసం ఈ చర్చలు చేపట్టినట్లు సమాచారం. రెండు రాష్ట్రాల మధ్య మంచి సమన్వయం ద్వారా నీటి వనరుల సమర్థవంతమైన వినియోగానికి దారి తీయాలని కేంద్రం ఆశిస్తోంది.

- Advertisement -
- Advertisement -
Latest News

రైతుల సంక్షోభంపై పార్లమెంట్‌లో గర్జించాలి: జగన్ ఎంపీలకు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలను సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -