Thursday, April 16, 2026

ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల‌ సీఎం‌ల భేటీ

Must Read

ఢిల్లీలోని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రాల మధ్య నీటి వనరుల పంపకం, నిర్వాహక విభజన, ప్రస్తుత ప్రాజెక్టుల పురోగతిపై ఈ సమావేశంలో లోతైన చర్చ జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర జలశక్తి శాఖ అధికారులు, రెండు రాష్ట్రాల ఇరిగేషన్ ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ మధ్యవర్తిగా వ్యవహరించిన ఈ భేటీ శాంతియుతంగా కొనసాగింది. పలు వివాదాస్పద ప్రాజెక్టుల విషయాలను, వాటి నిర్వహణ బాధ్యతలపై క్లారిటీ కోసం ఈ చర్చలు చేపట్టినట్లు సమాచారం. రెండు రాష్ట్రాల మధ్య మంచి సమన్వయం ద్వారా నీటి వనరుల సమర్థవంతమైన వినియోగానికి దారి తీయాలని కేంద్రం ఆశిస్తోంది.

- Advertisement -
- Advertisement -
Latest News

అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

తెలంగాణ శాసనసభలో ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల ఆందోళనల నేపథ్యంలో సభలో గందరగోళం చెలరేగింది. ఈ పరిణామాల...
- Advertisement -

More Articles Like This

- Advertisement -