Friday, September 11, 2026

రేవంత్ రెడ్డి కరప్ట్ సీఎం

Must Read

ఢిల్లీలో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం భారీ అవినీతికి పాల్పడుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి అన్నదమ్ములు, బావమరుదులు అక్రమంగా కాంట్రాక్టులు దక్కించుకొని ప్రజాధనం కొల్లగొడుతున్నారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి బావమరిదికి చెందిన శోధా కంపనీ టర్నోవర్ రూ.3కోట్లు ఉంటే ఆ కంపెనీకి రూ.1137 కోట్ల కాంట్రాక్టులు కట్టబెట్టారని ఆధారాలతో సహా బయటపెట్టారు. రేవంత్ రెడ్డి ఆర్ఆర్ టాక్స్ వసూలు చేస్తున్నాడని స్వయంగా ప్రధాని మోడీ చెప్తున్నాడు కానీ, చర్యలు మాత్రం తీసుకోవడం లేదన్నారు. అమృత్‌ స్కీం టెండర్లలో రేవంత్ బావమరిది సృజన్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రూ.వేల కోట్ల రూపాయల టెండర్లు కట్టబెట్టారని పేర్కొన్నారు. కేబినెట్ నిర్ణయాలు తీసుకునే మంత్రులకు కాంట్రాక్టులు కట్టబెడుతుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -