Thursday, November 13, 2025

విజయ్ ఆర్థిక‌ సాయాన్ని తిరస్కరించిన కుటుంబం!

Must Read

తమిళనాడు కరూర్‌లో సెప్టెంబర్ 27న జరిగిన తొక్కిసలాటలో మృతుడైన రమేశ్ భార్య సంఘవి, టీవీకే అధ్యక్షుడు విజయ్ పంపిన 20 లక్షల రూపాయల పరిహారాన్ని తిరిగి పంపేసింది. మృతుల కుటుంబాల ఖాతాల్లో ఈ నెల 18న జమ చేసిన మొత్తాన్ని తిప్పి పంపినట్లు సంఘవి తెలిపింది. విజయ్ వీడియో కాల్‌లో మాట్లాడుతూ, తను నేరుగా వచ్చి ఓదార్చుకుంటానని, ముందు ఆర్థిక సహాయం తీసుకోవాలని సూచించినట్లు ఆమె చెప్పింది. అయితే, డబ్బు ముఖ్యం కాదని, విజయ్ పరామర్శ కోసం ఎదురుచూస్తున్నామని, తమ ఇష్టానికి విరుద్ధంగా జమ చేసిన మొత్తాన్ని తిరిగి పంపామని బాధితులు వివరించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు న‌మోదు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సమయంలో కౌశిక్ రెడ్డి యూసుఫ్‌గూడ వద్ద ఫంక్షన్ హాల్‌లోకి అనుచరులతో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -