తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజలంతా కేకులు కట్ చేసి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. వీధుల్లో విహరిస్తూ ఈలలు, కేకలు వేస్తూ సంబరాలు జరుపుకొన్నారు. పలు సంస్థల ఆధ్వర్యంలో జరిగిన ఈవెంట్స్ ఆకట్టుకున్నాయి. హోటళ్లు, బార్లు, పబ్బులు ఎక్కడ చూసినా జన సందోహమే కనిపించింది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ తదితర నగరాల్లో ఘనంటా న్యూ ఇయర్ వేడుకలు జరిగాయి. డీజే చప్పుళ్ల మధ్య డాన్సులు చేశారు. ఈసారి వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి.
1
2
3