దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తెలంగాణ ఆత్మబంధువు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మన్మోహన్ కు భారత రత్న ఇవ్వాలని ప్రతిపాదించారు. హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. రైతు రుణమాఫీకి మన్మోహన్ స్ఫూర్తి ప్రధాతగా నిలిచారన్నారు. మన్మోహన్ సింగ్ కు భారత రత్న ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేశారు. దీనికి ఏకగ్రీవంగా ఆమోదం లభించింది.