Tuesday, April 28, 2026

ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు!

Must Read

ప్రకాశం జిల్లాలోని ఒంగోలు ప్రాంతంలో మరోసారి భూ ప్రకంపనలు సంభవించి, స్థానికులను ఆందోళనకు గురిచేశాయి. రాత్రి 2 గంటల సమయంలో సుమారు 2 సెకన్ల పాటు భూమి స్వల్పంగా కంపించినట్లు స్థానికులు తెలిపారు. ముఖ్యంగా, సీఎస్ఆర్ శర్మ కాలేజీ ప్రాంతంలో ఈ ప్రకంపనలు స్పష్టంగా కనిపించినట్లు వెల్లడించారు. అయితే, రాత్రి సమయం కావడంతో ఈ స్వల్ప ప్రకంపనలు గుర్తించేలోపే తీవ్రత తగ్గినట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. గతంలో కూడా ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది మే నెలలో మరియు గత ఏడాది డిసెంబర్‌లో ఇలాంటి ఘటనలు స్థానికులను భయాందోళనకు గురిచేశాయి. తాజా భూ ప్రకంపనలపై మరింత సమాచారం సేకరణ జరుగుతోంది.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -