Thursday, April 16, 2026

తెలంగాణలో పత్తి కొనుగోళ్లు బంద్

Must Read

తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చింది. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఎల్1, ఎల్2, ఎల్3 సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రెండుసార్లు ప్రభుత్వానికి తెలిపినా స్పందన లేదని సమ్మె చేపట్టారు. జిన్నింగ్ మిల్లులు, సీసీఐ కేంద్రాల్లో కొనుగోళ్లు ఆగాయి. ఇదే సమయంలో ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన యువరైతు సంతోష్ (30) వర్షాలతో పంట నష్టం కారణంగా పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. 10 ఎకరాల్లో పత్తి సాగు చేసిన ఆయన బెల్లంపల్లి ఆసుపత్రిలో మృతి చెందారు.

- Advertisement -
- Advertisement -
Latest News

అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

తెలంగాణ శాసనసభలో ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల ఆందోళనల నేపథ్యంలో సభలో గందరగోళం చెలరేగింది. ఈ పరిణామాల...
- Advertisement -

More Articles Like This

- Advertisement -