Monday, June 1, 2026

తెలంగాణలో పత్తి కొనుగోళ్లు బంద్

Must Read

తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చింది. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఎల్1, ఎల్2, ఎల్3 సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రెండుసార్లు ప్రభుత్వానికి తెలిపినా స్పందన లేదని సమ్మె చేపట్టారు. జిన్నింగ్ మిల్లులు, సీసీఐ కేంద్రాల్లో కొనుగోళ్లు ఆగాయి. ఇదే సమయంలో ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన యువరైతు సంతోష్ (30) వర్షాలతో పంట నష్టం కారణంగా పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. 10 ఎకరాల్లో పత్తి సాగు చేసిన ఆయన బెల్లంపల్లి ఆసుపత్రిలో మృతి చెందారు.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -