పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేయనుంది. ఏపీలోని విశాఖపట్నానికి చెందిన జేడీ చంద్రమౌళి, నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఐటి ఉద్యోగి మధుసూదన్ అనే ఇద్దరు వ్యక్తులు పహల్గామ్ ఉగ్రదాడిలో మృతి చెందారు. సీఎం చంద్రబాబు వారి కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు. మరోవైపు మధుసూదన్ మృతదేహం కావలిలోని ఆయన స్వగృహానికి చేరుకోవడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.