Thursday, April 16, 2026

రాయలసీమపై చంద్రబాబు నిర్లక్ష్యం: శైలజానాథ్

Must Read

వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి శైలజానాథ్, రాయలసీమ అభివృద్ధిపై చంద్రబాబు పూర్తి నిర్లక్ష్యం చూపుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, రాయలసీమకు చెందాల్సిన రాజధాని, హైకోర్టు, ఎయిమ్స్‌లను తరలించారని, నీటి వనరులు, నిధులను కోల్పోయామని ఆరోపించారు. శ్రీబాగ్ ఒప్పందం జరిగి 87 ఏళ్లు గడుస్తున్నా ఎలాంటి మార్పు లేదని, వైఎస్ జగన్ తాగు-సాగు నీటి ప్రాజెక్టులు తెచ్చారని కొనియాడారు. హంద్రీ-నీవా, గాలేరు-నగరి పనులను చంద్రబాబు ఆపేశారని, పోలవరం ఎత్తు తగ్గించడం ద్వారా అన్యాయం జరిగిందని విమర్శించారు. శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలి, జగన్ ప్రాజెక్టులను కొనసాగించాలి, సిద్దేశ్వర అలుగు నిర్మాణం చేపట్టాలి, నీళ్లు-నిధుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

తెలంగాణ శాసనసభలో ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల ఆందోళనల నేపథ్యంలో సభలో గందరగోళం చెలరేగింది. ఈ పరిణామాల...
- Advertisement -

More Articles Like This

- Advertisement -