Friday, January 24, 2025

తిరుపతికి బాంబు బెదిరింపు!

Must Read

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలోని పలు హోటల్స్ లో బాంబులు పెట్టామని గుర్తు తెలియని వ్యక్తి నుంచి మెయిల్ వచ్చింది. అర్ధరాత్రి ఈ ఘటన జరగగా.. పోలీసులు అప్రమత్తమై హోటళ్లను చెక్ చేశారు. లీలామహల్‌ సమీపంలోని మూడు ప్రైవేట్ హోటల్స్, రామానుజ కూడలిలోని మరో హోటల్‌కు ఈ–మెయిల్‌లో బెదిరింపులు వచ్చాయి. తమిళనాడులో టెర్రరిస్ట్ జాఫర్ సాది​క్ కు ఇటీవల జైలు శిక్ష ఖరారు చేయగా.. సదరు మెయిల్ లో ఆ అజ్ఞాత వ్యక్తి ఆక్రోశం వెళ్ళగక్కారు. శిక్ష పడేందుకు తమిళ సర్కార్ తరఫున సీఎం స్టాలిన్ సహకారం అందించడం తమకు నచ్చలేదంటూ టెర్రరిస్ట్ ఈ–మెయిల్ పంపాడు. రాష్ట్రంలోని పాఠశాలల్లో పేలుళ్లకు ఐఎస్‌ఐ పూనుకుందని, తిరుపతిలోనూ పలు హోటళ్లను పేల్చేస్తామని తెలిపాడు. దీంతో పోలీసులు హైఅలెర్ట్ అయ్యారు.

- Advertisement -
- Advertisement -
Latest News

‘పుష్ప-2’ 50 రోజులు పూర్తి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పుష్ప2: ది రూల్‌’. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప-2 సినిమా.. నేటికి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -