పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ పై ఇండియన్ ఆర్మీ దాడులను స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. మరో పహల్గామ్ లాంటి ఉగ్రదాడి జరగకుండా పాకిస్తాన్ కు సరైన గుణపాఠం చెప్పాలని తెలిపారు. పాక్ ఉగ్ర స్థావరాలను అన్నింటిని పూర్తిగా ధ్వంసం చేయాలంటూ జై హింద్ అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.