Monday, June 1, 2026

హిజ్రాల రక్షణకు తమిళనాడులో ‘అరణ్’ వసతి గృహాలు

Must Read

తమిళనాడు ప్రభుత్వం హిజ్రా సముదాయం వ్యక్తులపై జరిగే దాడులు, వేధింపుల నుంచి రక్షణ కల్పించేందుకు ‘అరణ్’ (రక్షణ) పేరుతో వసతి గృహాలను ప్రవేశపెట్టింది. తొలి విడతలో చెన్నై మరియు మదురైలో రెండు గృహాలను అందుబాటులోకి తెచ్చారు. భవిష్యత్తులో అవసరాలను బట్టి ఈ గృహాల సంఖ్యను పెంచనున్నారు. ఒక్కో కేంద్రంలో 25 మంది ఉండేలా సౌకర్యాలను ఏర్పాటు చేశారు. సమాజంలో అభద్రతాభావం, వివక్ష, వెలివేత, వేధింపులకు గురైన హిజ్రాలు లేదా అనాథలుగా మిగిలినవారు గుర్తింపు కార్డు చూపించి ఈ గృహాల్లో ఉచిత వసతిని పొందవచ్చు. బాధితుల్లో ధైర్యం నింపేందుకు ప్రభుత్వం కౌన్సెలింగ్ బృందాలను నియమించింది. ఈ గృహాల్లో ఆహారం, దుస్తులతో పాటు చదువుకునే సౌకర్యాన్ని సామాజిక సంక్షేమం మరియు మహిళా సాధికారత శాఖ కల్పిస్తోంది. అవసరమైన వారికి న్యాయ సాయం కూడా అందించనున్నారు. ఈ వసతి గృహాల్లో 3 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు ఉండే అవకాశం ఉంటుంది.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -