టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా టాప్ హీరోయిన్ గా సమంత మంచి పేరు తెచ్చుకుంది. తన నటన, సోషల్ సర్వీస్ తో తనకు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు వచ్చింది. ఇక వ్యక్తిగత జీవితంతో సైతం తాను తరచూ వార్తల్లో నిలుస్తున్నది. నాగచైతన్య తి వివాహం, విడాకులు సమంతా జీవితంలో చాలా పెద్ద పరిణామాలు. వీరి పెళ్లి జరిగినప్పుడు ఎంత చర్చ నడిచిందో, విడాకులు జరిగినప్పుడు అంతకంటే పెద్ద దుమారమే రేగింది. నాగచైతన్య శోభితతో రెండో పెళ్లి కూడా చేసేసుకున్నారు. కానీ, సమంత మాత్రం ఇంకా సింగిల్ గానే ఉంది. కాగా, ఇప్పుడు వారికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సమంత నాగచైతన్య నుంచి రూ.200 కోట్ల భరణాన్ని తిరస్కరించిందని, దేశంలో ఇంత పెద్ద మొత్తంలో భరణాన్ని తిరస్కరించిన ఏకైక హీరోయిన్ సమంత మాత్రమే అని నెటిజన్లు పేర్కొంటున్నారు. మరి ఈ వార్తలో నిజమెంత ఉందో వేచి చూడాలి.