Monday, January 26, 2026

వరదల్లో కొట్టుకుపోయిన రూ.12 కోట్ల బంగారం

Must Read
  • చైనాలో షాంగ్జీ ప్రావిన్స్‌లో ఘ‌ట‌న‌
    చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్‌లో కురిసిన భారీ వర్షాలు వరదలకు దారితీశాయి. ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ నగల దుకాణం తీవ్ర నష్టాన్ని చవిచూసింది. వరద ఉధృతికి షాపులో ఉన్న బంగారం, వెండి ఆభరణాలు నీటిలో కొట్టుకుపోయాయి. అంచనా ప్రకారం సుమారు రూ.12 కోట్ల విలువైన ఆభరణాలు మిస్సైనట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన వెంటనే స్థానికులు వీధుల్లోకి వచ్చి బంగారం వెతికే ప్రయత్నం చేశారు. కొందరు వరద నీటిలో తడుముకుంటూ వెతికిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వరదలతో భారీ నష్టం సంభవించిన ఈ ఘటనపై చైనా అధికారులు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
- Advertisement -
Latest News

దేశ నిర్మాణంలో యువతే కీల‌క‌మ‌న్న ప్రధాని న‌రేంద్ర‌ మోడీ

దేశ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమైనదని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి స్పష్టం చేశారు. శనివారం జరిగిన 18వ ‘రోజ్‌గార్ మేళా’ కార్యక్రమంలో వీడియో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -