Thursday, April 16, 2026

సినీ ప‌రిశ్ర‌మ‌లో సిండికేట్ పెరిగింది – యాంక‌ర్ ఉద‌య‌భాను

Must Read

సీనియ‌ర్ యాంక‌ర్ ఉదయభాను సినీ ప‌రిశ్ర‌మ‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ ప‌రిశ్ర‌మ‌లో సిండికేట్ పెరిగింద‌ని ఆమె పేర్కొన్నారు. తాజాగా సుహాస్ హీరోగా నటించిన ‘ఓ భామ అయ్యో రామ’ సినిమా ప్రీరిలీజ్ వేడుకకు ఉదయభాను హోస్ట్ గా వ్యవహరించించారు.సినీ పరిశ్రమలో యాంక‌ర్ల‌కు అవకాశాలపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈవెంట్‌లో ఉద‌య‌భాను మాట్లాడుతూ… “ఇదొక్కటే చేశాను, మళ్లీ చేస్తానన్న నమ్మకం లేదు. కార్యక్రమం మన చేతిలో ఉండదు, అంత పెద్ద సిండికేట్ ఎదిగింది” అని వ్యాఖ్యానించారు. గతంలోనూ పరిశ్రమలో కుట్రలు ఉన్నాయంటూ ఆమె ఆరోప‌ణ‌లు చేశారు. కాగా, ప్ర‌స్తుత కాలంలో ఆమె అడ‌పాద‌డ‌పా ఈవెంట్లు చేస్తున్నా పెద్ద‌గా అవ‌కాశాలు రావ‌డం లేద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఉద‌య‌భాను చేసిన వ్యాఖ్య‌లు వైరల్‌గా మారాయి.

- Advertisement -
- Advertisement -
Latest News

అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

తెలంగాణ శాసనసభలో ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల ఆందోళనల నేపథ్యంలో సభలో గందరగోళం చెలరేగింది. ఈ పరిణామాల...
- Advertisement -

More Articles Like This

- Advertisement -