Home News జూన్‌ 23 నుంచి గ్రూప్-1 ఇంటర్వ్యూలు

జూన్‌ 23 నుంచి గ్రూప్-1 ఇంటర్వ్యూలు

0
98

ఇటీవ‌ల గ్రూప్‌-1 మెయిన్స్‌ ఫలితాలు విడుద‌ల చేసిన ఏపీపీఎస్సీ ఎంపికైన అభ్య‌ర్థుల‌కు ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అభ్యర్థులకు ఈ నెల 23వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఇంటర్వ్యూలు జర‌గ‌నున్నాయి. 1:2 నిష్పత్తిలో సుమారు 182 మందిని రెండు బోర్డుల ద్వారా ఇంటర్వ్యూ చేయ‌నున్నారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే రోజునే ఏపీపీఎస్సీ కార్యాలయంలో సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుంది. స్పోర్ట్స్ కేటగిరీలోని 42 మంది అభ్యర్థులకు ఈ నెల 17న సర్టిఫికెట్లు పరిశీలిస్తారు.