Wednesday, November 19, 2025

క‌న్నీటి ప‌ర్యంత‌మైన‌ మంచు మనోజ్

Must Read

ఇటీవ‌ల ప‌లు నాట‌కీయ ప‌రిణామాల‌తో మంచు ఫ్యామిలీ త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. వీరి కుటుంబంలో ఏం జ‌రుగుతుందో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. ఆస్తి త‌గాదాలే ముఖ్య కార‌ణ‌మ‌ని ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటున్నారు. ఈ క్ర‌మంలో ఓ కార్య‌క్ర‌మంలో మంచు మ‌నోజ్ ఎమోష‌న‌ల్ కావ‌డం హాట్ టాపిక్‌గా మారింది. మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘భైరవం’. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో మంచు మనోజ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈవెంట్ లో అతడిపై ఓ వీడియో ప్రదర్శించారు. అది చూసి మనోజ్ చలించిపోయాడు. ఎమోషన్ ఆపుకోలేక ఏడ్చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ‘భైరవం’ సినిమా మే 30న విడుదల కానుంది.

- Advertisement -
- Advertisement -
Latest News

రాజమౌళిపై బీజేపీ నాయ‌కురాలు మాధవీలత ఆగ్ర‌హం

బీజేపీ నాయకురాలు కోంపెల్ల మాధవీలత దర్శకేంద్రుడు ఎస్‌.ఎస్. రాజమౌళి “నాకు దేవుడిపై నమ్మకం లేదు” అని చెప్పిన వ్యాఖ్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్లోబల్...
- Advertisement -

More Articles Like This

- Advertisement -