Thursday, April 16, 2026

ఆప‌రేష‌న్ సింధూర్‌పై జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు

Must Read

ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడికి ప్ర‌తీకారంగా పాకిస్తాన్ సైన్యంపై భార‌త్ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ సింధూర్‌పై వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ స్పందించారు. ఈ మేర‌కు ఆయ‌న ఎక్స్ వేదిక‌గా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఉగ్ర దాడి ఘటనకు భార‌త‌ సైన్యం సరైన నిర్ణయం తీసుకుందని ప్రశంస‌లు కురిపించారు. పహల్గామ్‌లో ఉగ్రదాడి ఘటనకు ప్రతిస్పందనగా భారత రక్షణ దళాలు ఆపరేషన్‌ సింధూర్‌ ప్రారంభించాయ‌ని, మన సైన్యం సరైన నిర్ణయం తీసుకుంద‌ని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాల‌ని, దేశ ప్రజలను రక్షించడానికి కఠిన చర్యలు తీసుకోవాల‌ని కోరారు. ఈ పోరాటంలో మేమంతా అండగా నిలుస్తామ‌ని చెబుతూ.. జైహింద్ అని పోస్టు చేశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

తెలంగాణ శాసనసభలో ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల ఆందోళనల నేపథ్యంలో సభలో గందరగోళం చెలరేగింది. ఈ పరిణామాల...
- Advertisement -

More Articles Like This

- Advertisement -