Monday, April 27, 2026

కాశ్మీర్ అసెంబ్లీలో కొట్లాట!

Must Read

జమ్మూకాశ్మీర్ అసెంబ్లీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆర్టికల్ 370 పునరుద్ధరణపై అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఒకరినొకరు కొట్టుకున్నారు. ఆర్టికల్ 370ని తిరిగి ప్రవేశపెట్టాలని పీడీపీ ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మద్ షేక్ అసెంబ్లీలో బ్యానర్ ను ప్రదర్శించారు. దీనిపై ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యే సునీల్ శర్మ అభ్యంతరం తెలిపారు. దీంతో ఎమ్మెల్యేలు సహనం కోల్పోయి పిడిగుద్దులతో దాడులు చేసుకున్నారు. అసెంబ్లీ సిబ్బంది బీజేపీ ఎమ్మెల్యేలను బయటకు పంపారు. ఈ ఘటనపై బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రవీంద్రా రానా స్పందించారు. పీడీపీ, కాంగ్రెస్ పార్టీలు దేశ వ్యతిరేక శక్తులు, పాకిస్థాన్ తో చేతులు కలిపాయని ఆరోపించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -