Tuesday, April 28, 2026

పోలీసులపై మరోసారి పవన్ కళ్యాణ్ ఫైర్!

Must Read

వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలీసుల వైఖరిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. మంగళవారం వేమవరంలోని సరస్వతి ప్లాంట్ భూములను పరిశీలించేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం ఇక్కడి యువతని భయపెడితే.. పోలీసులు చూస్తూ ఊరుకున్నారని తెలిపారు. పోలీసులు మెత్తబడ్డారా? లేక భయపడ్డారా? అని ప్రశ్నించారు. ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ అంటే అనుమతి రాదని అందుకే పవర్ ప్లాంట్ అని చెప్పారన్నారు. పేదలకు ఇచ్చిన భూములను అన్యాయంగా లాక్కున్నారని ఫైర్ అయ్యారు. భయపెట్టి, బాంబులు వేసి రైతుల భూములు లాక్కున్నారని మండిపడ్డారు. తాము మెతక వైఖరితో లేమని చెప్పేందుకే ఇక్కడికి వచ్చామన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -