భారత్, పాకిస్తాన్ మధ్య పరిస్థితులు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో పాకిస్తాన్తో సరిహద్దులో ఉన్న రాష్ట్రాల్లో కేంద్రం హైఅలర్ట్ ప్రకటించింది. జమ్ముకశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్లో హై అలర్ట్ కొనసాగుతోంది. ఢిల్లీ, హర్యానా బెంగాల్లోనూ భద్రత కట్టుదిట్టం చేశారు. పోలీసులు పాలనాధికారులను సెలవులను రద్దు చేశారు. సరిహద్దు రాష్ట్రాల్లో విద్యాసంస్థలు మూసివేశారు. గుజరాత్ సముద్ర తీరం...
భారత్, పాకిస్తాన్ దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పందించారు. రెండు దేశాలు టిట్ ఫర్ టాట్ లాగా చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించుకొని ఇంతటితో దీన్ని ఆపేస్తారని ఆశిస్తున్నానని చెప్పారు. రెండు దేశాలతో తనకు మంచి సత్సంబంధాలు ఉన్నాయని, ఈ గొడవలు ఆపుతారంటే తనకు చేతనైన సాయం చేస్తానని ప్రకటించారు....
పాక్ ఉగ్ర స్థావరాలపై భారత్ జరుపుతున్న ఆపరేషన్ సింధూర్ ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై పలు దేశాలు స్పందిస్తున్నాయి. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాలు ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని సూచించారు. ఇరు దేశాల మధ్య పరిస్థితిలు చాలా దారుణంగా ఉన్నాయని, భారత్, పాక్లు దశాబ్దాలుగా గొడవ...
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ సైన్యంపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై వైసీపీ అధినేత వైయస్ జగన్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్ర దాడి ఘటనకు భారత సైన్యం సరైన నిర్ణయం తీసుకుందని ప్రశంసలు కురిపించారు. పహల్గామ్లో ఉగ్రదాడి ఘటనకు ప్రతిస్పందనగా భారత రక్షణ దళాలు...