కడప జిల్లాలో జరుగుతున్న జడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా చోటుచేసుకుంటున్న దాడులపై వైసీపీ నేతల బృందం గవర్నర్ అబ్దుల్ నజీర్ను రాజ్భవన్లో కలిసింది. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ నేతలపై జరుగుతున్న దాడుల వివరాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణతో పాటు మాజీ మంత్రులు...
అల్లూరి సీతారామరాజు జిల్లా, దేవీపట్నం మండలం శరభవరం గ్రామంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. స్థానిక సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగిని సౌమ్యను గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో బెదిరించి కిడ్నాప్ చేశారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. సచివాలయం సమీపంలో విధుల్లో ఉన్న సౌమ్యను అకస్మాత్తుగా ఒక వాహనంలోకి లాగేందుకు దుండగులు...
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా యువతకు ప్రత్యేక పిలుపునిచ్చారు. వారానికి కనీసం ఒకసారి చేనేత వస్త్రాలను ధరించడం ద్వారా ఆ రంగంపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్న వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆయన సూచించారు. సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతూ పవన్ కళ్యాణ్...
కడప జిల్లా పులివెందుల మండలంలో చోటుచేసుకున్న రాజకీయ ఉద్రిక్తతలు కేసుల వరకు వెళ్లాయి. ఇటీవల నల్లగొండ వారి పల్లెలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని ఆరోపణల నేపథ్యంలో పోలీసులు తీవ్రంగా స్పందించారు. వైసీపీ నాయకుడు వేముల రాము ఇచ్చిన ఫిర్యాదులో, ఎమ్మెల్సీ...
పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నిక నేపథ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగాలని కోరుతున్నవారిపై దాడులు, బెదిరింపులు జరుగుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆరోపణలు చేశారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన, టీడీపీ నేతలు పథకపూర్వకంగా రాష్ట్రాన్ని అలజడులకు గురిచేస్తున్నారని విమర్శించారు. పేర్ని నాని...
విశాఖపట్నంలో ఈ ఏడాది నవంబర్ 14, 15 తేదీల్లో నిర్వహించనున్న సీఐఐ 30వ భాగస్వామ్య సదస్సు – 2025కు సంబంధించి ఏర్పాట్లను సమీక్షించేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఆధ్వర్యంలో తొలి సమీక్ష సమావేశం ఉండవల్లిలో జరిగింది. మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సదస్సుకు సంబంధించిన...
విశాఖపట్నంలో గుట్టుచప్పుడు కాకుండా జూదం ఆడుతున్న ఆరుగురు మహిళలను పోలీసులు పట్టుకున్నారు. లలితానగర్ ప్రాంతంలో మహిళలు జూదంలో పాల్గొంటున్నారన్న సమాచారంతో నాలుగో పట్టణ పోలీసులు టాస్క్ఫోర్స్ సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఆరుగురు మహిళలను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.22,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు...
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఓటర్లకు ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తోంది. తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియా ద్వారా వివరాలను వెల్లడించారు.
స్త్రీ శక్తి – ఉచిత బస్సు...
అడవి ఏనుగుల నుంచి పంటలను రక్షంచేందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో కర్ణాటక నుంచి ఏపీకి తీసుకొచ్చిన కుంకీ ఏనుగులు తొలి ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశాయి. చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం మండల పరిధిలోని మొగిలి వద్ద మామిడి తోటలను ధ్వంసం చేస్తున్న అటవీ ఏనుగుల గుంపుని కుంకీలు విజయవంతంగా దారి మళ్లించి...
ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్తను అందించింది రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్–6 హామీల అమలులో భాగంగా ‘అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్’ పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు. ఈ పథకం ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరాయపాలెంలో నేడు ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని 46 లక్షల 85 వేల 838 మంది...
బీజేపీ నాయకురాలు కోంపెల్ల మాధవీలత దర్శకేంద్రుడు ఎస్.ఎస్. రాజమౌళి “నాకు దేవుడిపై నమ్మకం లేదు” అని చెప్పిన వ్యాఖ్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్లోబల్...