Thursday, April 16, 2026

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ పోరాటం

Must Read

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. శుక్రవారం టెలి కాన్ఫరెన్స్‌లో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు మరియు ఇతరులు హాజరయ్యారు. రచ్చబండ కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని, ఈ నెల 12న అసెంబ్లీ నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. పార్టీ కమిటీలు, డేటా డిజిటలైజేషన్‌పై దృష్టి పెట్టాలని, సోషల్ మీడియా ద్వారా కార్యక్రమాలను ప్రచారం చేయాలని తెలిపారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటం కొనసాగుతుందని, కోటి సంతకాల సేకరణపై రివ్యూ చేస్తామని చెప్పారు. మనతో కలిసి వచ్చే పార్టీలు, సమాజ సంఘాలను భాగస్వాములను చేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి పకడ్బందీగా సిద్ధమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

- Advertisement -
- Advertisement -
Latest News

అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

తెలంగాణ శాసనసభలో ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల ఆందోళనల నేపథ్యంలో సభలో గందరగోళం చెలరేగింది. ఈ పరిణామాల...
- Advertisement -

More Articles Like This

- Advertisement -