Saturday, April 18, 2026

యూపీఐ సేవలు శాశ్వతంగా ఉచితమన‌లేదు – ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా

Must Read

యూపీఐ సేవలు ఎప్పటికీ ఉచితంగా ఉంటాయన్న ప్రచారంపై ఆర్‌బీఐ డెప్యూటీ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టత ఇచ్చారు. యూపీఐ సేవలపై వాస్తవాలు వక్రీకరించబడుతున్నాయని ఆయన తెలిపారు. తాను ఇంతకు ముందు చెప్పిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. “యూపీఐ లావాదేవీలపై ఖర్చులు ఉంటాయి. వాటిని ఎవరో ఒకరు భరించాల్సిందే. వినియోగదారుల నుంచి ఛార్జీలు వసూలు చేయకపోయినా, ప్రస్తుతం వాటిని ప్రభుత్వం సబ్సిడీల రూపంలో భరిస్తోంది,” అని మల్హోత్రా వివరించారు. చెల్లింపుల వ్యవస్థ కొనసాగడం కోసం పెట్టే ఖర్చులను దేనో ఒక రూపంలో భరించాల్సిన అవసరం తప్పదని స్పష్టం చేశారు.

ప్రస్తుత పరిస్థితి:
యూపీఐ చెల్లింపులపై వినియోగదారుల నుంచి ఛార్జీలు వసూలు చేయడం లేదు. ప్రభుత్వమే ప్రస్తుతం వాటిపై ఖర్చును భరిస్తోంది. యూపీఐ సేవల విస్తరణే ప్రభుత్వ ప్రాధాన్యంగా ఉంది. అయితే యూపీఐ సేవల ఉచితతపై భవిష్యత్‌లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది కేంద్ర ప్రభుత్వ పాలసీ ఆధారంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పరిశీలించదగిన అంశం ఏమిటంటే, యూపీఐ చెల్లింపులు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో, సాంకేతిక మౌలిక వసతుల నిర్వహణ, సేవల నాణ్యత పరిరక్షణకు స్థిరమైన ఆదాయ మార్గాలపై ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.

- Advertisement -
- Advertisement -
Latest News

అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

తెలంగాణ శాసనసభలో ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల ఆందోళనల నేపథ్యంలో సభలో గందరగోళం చెలరేగింది. ఈ పరిణామాల...
- Advertisement -

More Articles Like This

- Advertisement -