పాక్, భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు, సిబ్బంది, ఉద్యోగులకు సెలవులు రద్దు చేస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య కారణాలు మినహా ఏ ఒక్కరికి సెలవులు మంజూరు చేయకూడదని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే సెలవుల్లో ఉన్నవారి సెలవులను రద్దు చేస్తూ వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు సెలవుల రద్దు నిర్ణయం కొనసాగుతుందని స్పష్టం చేసింది.