తిరుపతిలోని శ్రీనివాసం వద్ద అపశ్రుతి చోటు చేసుకుంది. టోకెన్ల కోసం ఒక్కసారిగా భక్తులు రావడంతో తోపులాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. తొక్కిసలాటలో గాయపడిన బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. మృతుల్లో ఒక మహిళ ఉంది. మృతురాలు తమిళనాడులోని సేలంకు చెందిన మహిళగా గుర్తించారు. తోపులాట జరిగిన ప్రాంతాలకు విజిలెన్స్, పోలీసు బలగాలు భారీగా చేరుకున్నాయి.