2028లో లాస్ ఏంజెలెస్లో జరిగే ఒలింపిక్స్ లో క్రికెట్ను చేర్చనున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ వెల్లడించింది. మెన్స్, ఉమెన్స్ విభాగాల్లో ఆరు జట్ల చొప్పున అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. ఒక్కో జట్టు నుంచి 15 మంది చొప్పున 90 మంది క్రికెటర్లకు అనుమతించారు. క్రికెట్ మ్యాచ్ వేదికలు, షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. రాబోయే ఒలింపిక్స్లో మొత్తం ఐదు కొత్త క్రీడలకు ఐఓసీ అనుమతించింది. సాఫ్ట్బాల్, ఫ్లాగ్ ఫుట్బాల్, లాక్రోస్, స్క్వాష్లతో పాటు క్రికెట్ను చేర్చడానికి కమిటీ ఆమోదం తెలిపింది.