Thursday, April 16, 2026

ఇంట‌ర్ ఫెయిలై విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌

Must Read

ఇంట‌ర్ ఫెయిలైన మ‌న‌స్తాపంతో ఓ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న విశాఖ‌లో చోటుచేసుకుంది. విశాఖ జిల్లా రెడ్డి కంచరపాలెంకు చెందిన నిహారిక(17) నగరంలోని ఉమెన్స్‌ కాలేజీలో ఇంటర్ ప్ర‌థ‌మ‌ సంవత్సరం బైపీసీ పూర్తి చేసింది. ఇటీవ‌ల విడుద‌లైన ఫ‌లితాల్లో ఓ సబ్జెక్ట్‌లో ఫెయిల్‌ అయ్యింది. దీంతో మనస్తాపం చెందిన నిహారిక సోమ­వారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుంది. కుటుంబసభ్యులు గుర్తించి కిందకు దించేసరికి ఆమె ప్రాణాలు కోల్పోయింది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
- Advertisement -
Latest News

అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

తెలంగాణ శాసనసభలో ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల ఆందోళనల నేపథ్యంలో సభలో గందరగోళం చెలరేగింది. ఈ పరిణామాల...
- Advertisement -

More Articles Like This

- Advertisement -