ఇంటర్ ఫెయిలైన మనస్తాపంతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖలో చోటుచేసుకుంది. విశాఖ జిల్లా రెడ్డి కంచరపాలెంకు చెందిన నిహారిక(17) నగరంలోని ఉమెన్స్ కాలేజీలో ఇంటర్ ప్రథమ సంవత్సరం బైపీసీ పూర్తి చేసింది. ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఓ సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యింది. దీంతో మనస్తాపం చెందిన నిహారిక సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుంది. కుటుంబసభ్యులు గుర్తించి కిందకు దించేసరికి ఆమె ప్రాణాలు కోల్పోయింది. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.