Tuesday, April 28, 2026

ఉద్యోగం కోసం తండ్రిని చంపిన త‌న‌యుడు

Must Read

కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలోని పులకుర్తిలో ఒక్కసారిగా గ్రామాన్ని షాక్‌కు గురి చేసే ఘటన జరిగింది. తండ్రి చేస్తున్న ఆర్టీసీ డ్రైవర్‌ ఉద్యోగం తనకే రావాలని పట్టుబడిన కుమారుడు, చివరకు సొంత‌ తండ్రినే దారుణంగా హతమార్చాడు. గ్రామానికి చెందిన రామాచారి (58) ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపోలో బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. భార్య విరుపాక్షమ్మ, కుమారుడు వీరస్వామి, కుమార్తెతో సాదాసీదా జీవితం గడుపుతున్నారు. డిగ్రీ వరకు చదివిన వీరస్వామి కొంతకాలం ప్రైవేట్‌ ఉద్యోగాలు చేసినా, తర్వాత వాటిని వదిలి గ్రామంలోనే నిర్లక్ష్యంగా గడిపేవాడు. ఇటీవల తండ్రి ఉద్యోగం తనకు రావాలని వీరస్వామి తరచూ గొడవలు పెడుతుండేవాడు. బుధవారం తెల్లవారుజామున ఈ వివాదం మరింత పెరిగి, కోపం ఆవేశంగా మారింది. తండ్రితో తగాదా పెట్టుకున్న వీరస్వామి, రోకలిబండతో తలపై బలంగా కొట్టి అక్కడికక్కడే రామాచారిని హతమార్చాడు. ఈ దారుణాన్ని గమనించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే కోడుమూరు పోలీసులు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతుడి భార్య విరుపాక్షమ్మ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేవ‌లం ఉద్యోగం కోసం తండ్రిని హతమార్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -