Thursday, April 16, 2026

కల్తీ నెయ్యి కేసులో వైవీ సుబ్బారెడ్డిపై సిట్ విచార‌ణ‌

Must Read

టీటీడీ మాజీ ఛైర్మన్, వైఎస్ఆర్‌సీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి నివాసంలో సుమారు 10 గంటల పాటు సిట్ అధికారులు విచారణ జరిపారు. కీలక పత్రాలను స్వాధీనం చేసుకొని తిరుపతి సిట్ కార్యాలయానికి తరలించారు. అవసరమైతే మళ్లీ హాజరు కావాలని సూచించారు. విచారణ అనంతరం సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ “అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇచ్చా. కల్తీ నెయ్యి వాస్తవాలు బయటపడాలనే సుప్రీంకోర్టులోనే పిటిషన్ వేశా. అవినీతి చేయాలంటే కోట్ల విలువైన ప్రాజెక్టులు ఉన్నాయి, నెయ్యి ఎందుకు?” అని ప్రశ్నించారు. 2014 నుంచి నెయ్యి సరఫరాలపైనా విచారణ జరపాలని, తన పీఏ కాదని 2018 నుంచే అప్పన్న అని స్పష్టం చేశారు. ఎప్పుడైనా పూర్తిగా సహకరిస్తానని హామీ ఇచ్చారు.

- Advertisement -
- Advertisement -
Latest News

అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

తెలంగాణ శాసనసభలో ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల ఆందోళనల నేపథ్యంలో సభలో గందరగోళం చెలరేగింది. ఈ పరిణామాల...
- Advertisement -

More Articles Like This

- Advertisement -