Thursday, April 16, 2026

హైవేపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం

Must Read

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు సమీపంలో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై విహారి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతతో బస్సును వెంటనే పక్కకు ఆపి ఎమర్జెన్సీ ఎగ్జిట్ తెరిచాడు. బస్సులోని 29 మంది ప్రయాణికులు అద్దాలు పగులగొట్టి బయటపడ్డారు. ప్రమాదానికి 10 నిమిషాల ముందు టీ బ్రేక్ తీసుకున్నారు. బస్సు మళ్లీ బయలుదేరిన కొద్దిసేపటికే పొగలు రావడంతో డ్రైవర్ స్పందించాడు. ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. బస్సు పూర్తిగా కాలిపోయింది కానీ ఎవరికీ గాయాలు కాలేదు. పోలీసులు ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టారు.

- Advertisement -
- Advertisement -
Latest News

అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

తెలంగాణ శాసనసభలో ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల ఆందోళనల నేపథ్యంలో సభలో గందరగోళం చెలరేగింది. ఈ పరిణామాల...
- Advertisement -

More Articles Like This

- Advertisement -