Tuesday, April 28, 2026

విద్యార్థినిపై ప్రిన్సిపాల్ అఘాయిత్యం

Must Read

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలోని రాయవరం మండలం మాచవరం గ్రామంలో ఓ దారుణ‌ సంఘటన వెలుగులోకి వచ్చింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే మైనర్ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన స్థానికులను కలచివేస్తోంది. సమాచారం ప్రకారం, నాలుగు నెలల క్రితం ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ జయరాజు 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో బాధితురాలు భయపడి నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఈ లోపు, పలుమార్లు దారుణానికి పాల్పడినట్లు సమాచారం. ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న ఆ విద్యార్థిని మూడు నెలలుగా పీరియడ్స్ రాకపోవడంతో కుటుంబ సభ్యులు వైద్యులను సంప్రదించగా.. గర్భవతి అని తేలింది. దీంతో షాక్‌కు గురైన తల్లిదండ్రులు రాయవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, ప్రిన్సిపాల్ జయరాజును అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -