Thursday, March 12, 2026

పోలీసుల అదుపులో మ‌ల‌క్‌పేట్ హ‌త్య కేసు నిందితులు

Must Read

మలక్‌పేట్‌లో ఇటీవల చోటుచేసుకున్న సీపీఐ నేత చందురాథోడ్ హత్యకేసు దర్యాప్తులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో మొత్తం 9 మంది నిందితులను గుర్తించినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో నలుగురిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు, మిగిలిన ఐదుగురి కోసం గాలింపు ముమ్మరంగా కొనసాగుతోంది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, వ్యక్తిగత విభేదాలే హత్యకు దారితీశాయి. చందురాథోడ్‌తో రాజేష్ అనే వ్యక్తికి భూములపై వివాదాలు ఉన్నట్లు ఆధారాలు లభించాయని తెలిపారు. కంట్లూర్ పరిధిలో ఈ భూ తగాదాలు కొనసాగినట్టు వెల్లడైంది. అలాగే, వివాహేతర సంబంధాల కోణంలో కూడా విచారణ సాగుతోందని సమాచారం. ఘటన జరిగిన అనంతరం నిందితులంతా చౌటుప్పల్ వైపు పారిపోయినట్టు సీసీటీవీ ఫుటేజ్‌ ద్వారా గుర్తించడంతో పాటు, మొబైల్ టవర్ లొకేషన్లను, సాంకేతిక ఆధారాలను బట్టి వారి పట్ల స్పష్టతకు పోలీసులు చేరుకుంటున్నారు. 10 ప్రత్యేక పోలీసు బృందాలు మిగిలిన ఐదుగురి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. మరోవైపు ఈ హత్యకేసుకు రాజకీయ కోణం ఉందా? అనే దానిపై కూడా విచారణ కొనసాగుతోంది. పరిస్థితి మరోసారి అలా మళ్లకుండేందుకు మలక్‌పేట్‌ పరిధిలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రజల భద్రత కోసం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Latest News

నోటీసుల‌పై భ‌గ్గుమ‌న్న గులాబీ నేత‌లు

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ నోటీసులు జారీ చేయడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -