వైసీసీపీ అధినేత వైయస్ జగన్ నేడు ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో భేటీ అయ్యారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాలపై ఆయన కేడర్కు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి, మేయర్ బీవై రామయ్య, మాజీ ఎమ్మెల్యేలు శ్రీదేవి, శిల్పా రవి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్ సహా పలువురు నేతకు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన, వైఫల్యాలపై చేయాల్సిన పోరాటం గురించి చర్చించనున్నారు.