Thursday, January 15, 2026

తెలంగాణలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్

Must Read

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల తేదీలు ఖరారయ్యాయి. మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. నవంబర్ 27న నోటిఫికేషన్ జారీ చేస్తారు. పోలింగ్‌కు 15 రోజుల సమయం ఉంటుంది. డిసెంబర్ 11న మొదటి దశ పోలింగ్ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటిస్తారు. రెండు, మూడు దశలు నాలుగు రోజుల తేడాతో డిసెంబర్ 15, 19 తేదీల్లో జరిగే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహిస్తుంది. రాష్ట్రంలో 31 జిల్లాల్లో 545 మండలాలు, 12,760 పంచాయతీలు, 1,13,534 వార్డుల్లో ఎన్నికలు జరుగుతాయి. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత ఏర్పాట్లు పూర్తి చేశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రైతుల సంక్షోభంపై పార్లమెంట్‌లో గర్జించాలి: జగన్ ఎంపీలకు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలను సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -