తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల తేదీలు ఖరారయ్యాయి. మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. నవంబర్ 27న నోటిఫికేషన్ జారీ చేస్తారు. పోలింగ్కు 15 రోజుల సమయం ఉంటుంది. డిసెంబర్ 11న మొదటి దశ పోలింగ్ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటిస్తారు. రెండు, మూడు దశలు నాలుగు రోజుల తేడాతో డిసెంబర్ 15, 19 తేదీల్లో జరిగే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహిస్తుంది. రాష్ట్రంలో 31 జిల్లాల్లో 545 మండలాలు, 12,760 పంచాయతీలు, 1,13,534 వార్డుల్లో ఎన్నికలు జరుగుతాయి. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత ఏర్పాట్లు పూర్తి చేశారు.

