ఏపీ ప్రజలకు అధికారులు శుభవార్త చెప్పారు. మారుమూల ప్రాంతాల ప్రజలకు సైతం ఇంటి వద్దే పాస్ పోర్ట్ సేవలు అందించేందుకు ‘మొబైల్ వ్యాన్’ను సిద్ధం చేశారు. ఈ వ్యాన్ ఏ రోజు ఏయే ప్రాంతాల్లో ప్రయాణిస్తుందో వెబ్ సైటులో వివరంగా ఉంచుతారు. దాన్ని బట్టి స్లాట్ బుక్ చేసుకునే వారికి వారి ప్రాంతంలోనే సర్టిఫికెట్ల పరిశీలన, వేలిముద్రలు, ఫొటోలు తీసుకొని ప్రక్రియ పూర్తి చేస్తారు. వెరిఫికేషన్ పూర్తయ్యాక పోస్టులో ఇంటికే పాస్ పోర్టు పంపిస్తారు.