Thursday, April 16, 2026

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు మంద‌కొడిగా పోలింగ్‌

Must Read

హైదరాబాద్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్ మంగ‌ళ‌వారం ఉదయం 7 గంటలకు మొదలైంది. మొదటి రెండు గంటల్లో 9.2 శాతం ఓటర్లు మాత్రమే ఓటు వేశారు. 4.01 లక్షల మంది ఓటర్లు 407 పోలింగ్ బూత్‌లలో సాయంత్రం 6 గంటల వరకు ఓటు వేసే అవకాశం ఉంది. వెంగళ్ రావు నగర్ డివిజన్‌లో 54,620 మంది ఓటర్ల కోసం 54 బూత్‌లు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద మొదట్లో నెమ్మదిగా ఓటర్లు వచ్చినా, తర్వాత క్రమంగా పెరిగే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు అంచనా. మొదటిసారి ఓటు వేసే 18-19 ఏళ్ల యువతలో ఉత్సాహం కనిపిస్తోంది. కాంగ్రెస్ (MIM సపోర్ట్‌తో), బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య ముఖ్య పోటీ నెలకొంది. 226 బూత్‌లు సున్నితంగా గుర్తించి భద్రతా మార్గదర్శకాలు అమలు చేశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

తెలంగాణ శాసనసభలో ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల ఆందోళనల నేపథ్యంలో సభలో గందరగోళం చెలరేగింది. ఈ పరిణామాల...
- Advertisement -

More Articles Like This

- Advertisement -