Monday, June 1, 2026

బిహార్ ఎన్నికల వేళ పార్టీల్లో నాయకుల బహిష్కరణ

Must Read

బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం రసవత్తరంగా మారింది. ప్రతిపక్ష RJD కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఇద్దరు ఎమ్మెల్యేలు సహా 27 నాయకులను బహిష్కరించింది. పార్టీ చీఫ్ మంగని లాల్ మండల్ ప్రకటనలో ఈ విషయం వెల్లడించారు. బహిష్కరించిన నాయకులను ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేశారు. మహాగఠ్ బంధన్ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేసినందుకు ఈ చర్య తీసుకున్నారు. బహిష్కరించిన 27 మందిలో ఇద్దరు ఎమ్మెల్యేలు చోటే లాల్ రాయ్ మహ్మద్ కమ్రాన్ నలుగురు మాజీ ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. ముందుగా BJP కూడా ఆరుగురు నేతలను బహిష్కరించింది. NDA అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేసినందుకు ఈ చర్య తీసుకున్నారు. బహిష్కరించిన వారిలో ఎమ్మెల్యే పవన్ యాదవ్ ఉన్నారు. టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. నవంబర్ 6 11 తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపడతారు.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -