Monday, December 29, 2025

క‌మిష‌న్ ముందు నిల్చోపెట్టి పైశాచిక ఆనందం – కేటీఆర్

Must Read

బీఆర్ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వ‌రం క‌మిష‌న్ విచార‌ణ సంద‌ర్భంగా కేటీఆర్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. కేసీఆర్‌ను కమిషన్ ముందు నుంచో బెడితే నీకు పైశాచిక ఆనందం వస్తుంది కానీ….ఆయన ఖ్యాతి ఇసుమంత కూడా తగ్గదంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఎప్పటికీ తెలంగాణ కోసం ప్రాణాన్ని పణంగా పెట్టిన ధీరుడేన‌ని, మీరంతా సూర్యుడిని అరచేతితో ఆపాలనుకునే మూర్ఖులేన‌ని విమ‌ర్శించారు. బ్యాగులు మోసే మీకు భగీరథ ప్రయత్నాలు అర్థం కావడానికి ఎన్ని జన్మలైనా సరిపోవ‌ని సెటైర్లు వేశారు. తెలంగాణ కన్నీళ్లు తుడిచిన కాళేశ్వరాన్ని అర్థం చేసుకోవడానికి మీ తెలివి సరిపోదంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణని తెచ్చింది కేసీఆర్ నాయకత్వం అని, తెలంగాణను సస్యశ్యామలం చేసింది కాళేశ్వరం ప్రాజెక్టు అని, ఇది చ‌రిత్ర‌లో ఎప్ప‌టికీ నిలిచిపోయే వాస్త‌వం అని పేర్కొన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రైతుల సంక్షోభంపై పార్లమెంట్‌లో గర్జించాలి: జగన్ ఎంపీలకు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలను సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -