Sunday, December 7, 2025

డ‌బుల్ ఇంజిన్ స‌ర్కార్‌లో కూలుతున్న వంతెన‌లు

Must Read

గుజ‌రాత్‌లోని వ‌డోద‌ర‌లో వంతెన కూలిన దుర్ఘ‌ట‌న‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. డ‌బుల్ ఇంజిన్ స‌ర్కార్‌లో వంతెన‌ల‌న్నీ కూలిపోతున్నాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. డబుల్ ఇంజిన్ గుజరాత్ నమూనాకు మరో రోజు మరొక అద్భుతమైన ఉదాహరణ అంటూ సెటైర్లు వేశారు. ఒక క్షణం మీరు వంతెనపై ఉంటారు.. మరొక క్షణం నదిలో ఉంటారంటూ వ్యంగ్యంగా స్పందించారు. మోర్బి వంతెన కూలిపోయి 140 మందికి పైగా మరణించిన తర్వాత, ఇది మరొక షాకింగ్ విషయ‌మ‌ని పేర్కొన్నారు. గుజరాత్, డబుల్ ఇంజిన్ బీహార్, మధ్యప్రదేశ్‌లలో కూలిపోతున్న ఈ వంతెనలన్నింటినీ ఎన్డీఎస్ఏ లేదా ఇతర వంతెన భద్రతా సంస్థలు దర్యాప్తు చేస్తాయని ఖచ్చితంగా భావిస్తున్నాన‌న్నారు. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న‌ట్లు తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రైతుల సంక్షోభంపై పార్లమెంట్‌లో గర్జించాలి: జగన్ ఎంపీలకు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలను సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -