కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి సందర్బంగా నేడు వైసీపీ అధినేత వైయస్ జగన్ ఆయనకు ఘన నివాళి అర్పించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా జగన్ ఓ పోస్టు చేశారు. స్త్రీ జనోద్ధరణకు తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు కందుకూరి వీరేశలింగం పంతులు. తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి కందుకూరి. సాహితీవేత్తగా, సంఘ సంస్కర్తగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయన ఆశయాలు ఈ తరానికి స్ఫూర్తిదాయకం.. అని ఆయన పోస్టులో రాసుకొచ్చారు.