Wednesday, November 12, 2025

శ్రీశైలానికి పెరిగిన వ‌ర‌ద‌

Must Read

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం స్వల్పంగా పెరిగింది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలానికి సెకనుకు 32,059 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు 66,131 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 881 అడుగులుగా ఉంది. అలాగే, జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 193.40 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. అధికారులు విడుదల చేస్తున్న నీటి కారణంగా కృష్ణా నది దిగువ ప్రవాహ ప్రాంతాల వద్ద నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. నాగార్జునసాగర్ ప్రాంతం సహా కృష్ణా నదికి ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలానికి ప్రవాహం 32,059 క్యూసెక్కులు ఉంది. శ్రీశైలం నుంచి సాగర్‌కు 66,131 క్యూసెక్కులు విడుద‌ల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 881 అడుగులు ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు, కాగా ప్రస్తుత నిల్వ 193.40 టీఎంసీలుగా ఉంది. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో వర్షపాతం ఆధారంగా రాబోయే రోజుల్లో ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Latest News

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు న‌మోదు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సమయంలో కౌశిక్ రెడ్డి యూసుఫ్‌గూడ వద్ద ఫంక్షన్ హాల్‌లోకి అనుచరులతో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -