Wednesday, July 15, 2026

మావోయిస్టు నేతలపై హెబియస్ కార్పస్ పిటిషన్

Must Read

మావోయిస్టు నాయకులు దేవజీ, మల్లా రాజిరెడ్డిని కోర్టు ముందు హాజరుపరచాలంటూ దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. పోలీసులు “ఈ ఇద్దరూ మా అదుపులో లేరు. అరెస్టు చేసిన వారిని నియమాల ప్రకారం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచాం” అని నివేదిక సమర్పించారు. కానీ పిటిషనర్ తరఫు న్యాయవాది “పోలీసులు ముందు ప్రెస్‌కు ఎంకౌంటర్ జరిగిందని స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఆ ప్రెస్ స్టేట్‌మెంట్‌ను కోర్టు ముందు ఉంచుతాం” అని వాదించారు. దీనిపై హైకోర్టు, “మావోయిస్టు నేతలు పోలీసు అదుపులోనే ఉన్నారని నిరూపించే ఆధారాలు సమర్పించండి” అని పిటిషనర్లకు ఆదేశించింది. కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -