Thursday, May 28, 2026

సెక్రటేరియట్ కు దూసుకెళ్తున్న నిరుద్యోగులు

Must Read

తెలంగాణలో జీవో 29ను తక్షణమే ఉపసంహరించుకోవాలని గ్రూప్–1 అభ్యర్థులు ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జీవో 29ను రద్దు చేసి.. జీవో 55 అమలు చేయాలని డిమాండ్ చేశారు. జీవో 29 కారణంగా అణగారిన వర్గాల వారికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగుల ధర్నాకు బీజేపీ ఎంపీ బండి సంజయ్ మద్దతు తెలిపారు. నిరుద్యోగులతో కలిసి సెక్రటేరియట్ వరకు ర్యాలీ తీస్తున్నారు. రామకృష్ణమఠం వద్ద పోలీసులు వీరిని అడ్డుకున్నారు. ప్రస్తుతం అశోక్ నగర్ మొత్తం నినాదాలతో మారుమోగుతోంది.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -